ఈరోజు నుంచి తిరుమల శ్రీవారి దర్శనం

ఈరోజు నుంచి తిరుమల శ్రీవారి దర్శనం
x
Highlights

ఇవాళ్టి నుంచి భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం లభించనుంది. ఇప్పటివరకు ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించిన టీటీడీ ఈరోజు నుంచి సాధారణ...

ఇవాళ్టి నుంచి భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం లభించనుంది. ఇప్పటివరకు ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించిన టీటీడీ ఈరోజు నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు కల్పించనుంది. రోజుకు 6వేల టిక్కెట్లు కేటాయించగా శనివారం వరకు టికెట్లన్నీ బుక్ అయిపోయాయి.

ఇక, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం రోజుకు 50వేల లడ్డూలను సిద్ధంచేస్తున్నారు. ప్రతి భక్తుడికీ ఒక ఉచిత లడ్డూతోపాటు కావాల్సిన లడ్డూలను 50 రూపాయలకు విక్రయించడానికి కౌంటర్లు రెడీ చేశారు. ఇక భక్తుల రాకతో ఇన్నాళ్లూ మూతపడ్డ అలిపిరి నడకదారి కూడా తెరుచుకుంది. నేడు మూడువేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. ట్రయల్ రన్ లో నిన్న శ్రీవారిని 7200 మంది స్థానికులు దర్శించుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories