విరాళమిస్తే శ్రీవారి విఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్టు

విరాళమిస్తే శ్రీవారి విఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్టు
x
Highlights

♦ శ్రీవాణి ట్రస్టుకు 10 వేలు విరాళమిచ్చే భక్తులకువిఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు : ఏవి ధర్మారెడ్డి, టీటీడీ అదనపు ఈఓ

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీవారిని దగ్గరగా కనులారా దర్శించుకోవాలన్న కోరిక గల భక్తులకు టీటీడీ శుభవార్త వినిపించింది...ఏ మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రభుత్వాధికారి సిఫార్సు అవసరం లేకుండా టీటీడీ శ్రీ‌వాణి ట్ర‌స్టుకు 10 వేల రూపాయలు విరాళమిస్తే విఐపి బ్రేక్ ద‌ర్శ‌న టికెట్ కేటాయించే నూతన పథకాన్ని టీటీడీ శ్రీకారం చుట్టింది.... ట్రస్టుకు‌ విరాళమిచ్చిన భక్తులకు మాత్రమే విఐపీ బ్రేక్ దర్శనం కేటాయించే ఈ నూతన వెసులబాటు పథకం ఎలా ఉండబోతుంది.....చుద్దామా

హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి ఇత‌ర వెనుక‌బ‌డిన‌ ప్రాంతాల్లో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణానికి, పురాత‌న ఆల‌యాల ప‌రిర‌క్ష‌ణ‌కు శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా విరాళాలు స్వీక‌రిస్తున్నామ‌ని టిటిడి అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా విరాళాలిచ్చే భక్తులకు ప్రివిలేజ్ లో భాగంగా విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌న్నారు.....శ్రీ‌వాణి ట్ర‌స్టుకు విరాళాలిచ్చే దాత‌ల‌కు బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు ఇచ్చే విధానాన్ని సోమ‌వారం నుండి న‌లుగురు దాత‌ల‌తో ప్రారంభించామ‌ని వెల్ల‌డించారు. ఇందుకోసం గోకులం విశ్రాంతి గృహంలో ఆఫ్‌లైన్‌లో సింగిల్ విండో కౌంట‌ర్‌ను ప్రారంభించామ‌ని తెలిపారు. న‌వంబ‌రు మొద‌టి వారంలో ఇందుకోసం ప్ర‌త్యేకంగా యాప్‌ను ప్రారంభిస్తామ‌ని, ఆ త‌రువాత ప్ర‌పంచం న‌లుమూల‌ల నుండి భ‌క్తులు ఆన్‌లైన్‌లో విరాళాలందించ‌వ‌చ్చ‌ని చెప్పారు. శ్రీ‌వాణి ట్ర‌స్టుకు రూ.10 వేలు విరాళ‌మిచ్చే దాత‌ల‌కు ఒక బ్రేక్ ద‌ర్శ‌న టికెట్ ప్రివిలేజ్‌గా ఒక‌సారి మాత్ర‌మే అందిస్తామ‌ని, వెంట‌నే స‌ద‌రు దాత‌లు రూ.500/- చెల్లించి బ్రేక్ ద‌ర్శ‌న టికెట్ కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించారు. శ్రీ‌వాణి ట్ర‌స్టుకు దాత‌లు ఒక రూపాయి నుండి ఎంత‌మొత్త‌మైనా విరాళంగా అందించవ‌చ్చ‌ని రూ.10 వేల నుండి టిటిడి క‌ల్పించే ప్ర‌యోజ‌నాలు వ‌ర్తిస్తాయ‌ని తెలిపారు. రూ.10 వేల‌కు ఒక బ్రేక్ ద‌ర్శ‌న టికెట్ చొప్పున 99 వేల వ‌ర‌కు 9 టికెట్ల‌ను దాత‌లు పొందే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఒక ల‌క్ష పైన విరాళాందించే దాత‌ల‌కు టిటిడి ఇదివ‌ర‌కే ప‌లు ట్ర‌స్టులు, స్కీమ్‌లకు అందిస్తున్న త‌ర‌హాలోనే ప్ర‌యోజ‌నాల‌ను వ‌ర్తింప‌చేస్తామ‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించామ‌ని, భ‌క్తుల స్పంద‌న‌ను దృష్టిలో ఉంచుకుని కోటా నిర్ణ‌యిస్తామ‌ని, ఒక నెల ముందే ఈ కోటాను తెలియ‌జేస్తామ‌ని ధర్మారెడ్డి వివరించారు.

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మొట్టమొదటగా చెన్నైకి గుమ్మడి రామయ్య రూ.40,000 విరాళం చెల్లించి 4 బ్రేక్ దర్శనం టిక్కెట్లు పొందారు...ఈ స్కీమ్ కు ఇకపై భక్తులు అందజేసే విరాళాలతో పెద్దసంఖ్యలో గిరిజన, హరిజన వాడల్లో వెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణాలు జరగాలని కాంక్షిస్తున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories