కాణిపాక వరసిద్ది వినాయక విశిష్టతలు

కాణిపాక వరసిద్ది వినాయక విశిష్టతలు
x
Highlights

హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి.. అన్నికార్యములకూ, పూజలకూ ప్రథమముగా పూజింపవలసినవాడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లా...

హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి.. అన్నికార్యములకూ, పూజలకూ ప్రథమముగా పూజింపవలసినవాడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లా ప్రసిద్ద పుణ్యక్షేత్రాలకి నిలయం.. సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుపతికి అరవై కిలోమీటర్ల దూరంలో మరో ప్రసిద్ద పుణ్యక్షేత్రం ఉంది. అదే కాణిపాకం.. ఇక్కడ విజ్ఞేశ్వరుడు స్వయంగా వెలిసాడని పురాణాలూ చెబుతున్నాయి. ఈ ఆలయ చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కాణిపాకం అనే పేరు రావడానికి దాని వెనుక ఓ పురాణ గాధ అమలులో ఉంది. ఒకప్పుడు మూగ, చెవిటి, గుడ్డివారు అయిన ముగ్గురి అన్నదమ్ముల ఉండేవారు. వారి వ్యవసాయ బావిలో నీరు ఎండిపోవడం గమనించి బావిని ఇంకొద్దిగా తవ్వితే నీళ్లు వస్తాయని తవ్వడం మొదలు పెట్టగా అక్కడ గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరటం మొదలైంది. కొద్దీ కొద్దిగా బావి నిండుతుంది. ఆ ముగ్గురు అన్నదమ్ములు ఏమైందో అని గమనించగ బావిలో వినాయకుడి విగ్రహం కనిపించింది. వారు ఆ విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవటితనం తొలగి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్తులకు తెలిసి ఆ విగ్రహాన్ని పూజించడం మొదలు పెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరి కాయల నీరు ఒకటి మరియు పావు ఎకరము అంత విస్తీర్ణము పారింది దానితో ఆ స్థలానికి "కాణిపరకం " అనే తమిళ పేరు వచ్చింది, రాను రాను ఇది "కాణిపాకం" గా మారిందని ఓ కథ ప్రాచీనంలో ఉంది.

ఆలయ ప్రత్యేకతలు

ఇక్కడ స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. ఇక్కడి వినాయకడి పరిమాణం పెరుగుతూ ఉంటుంది.

♦ స్వామివారికి అష్టోత్తర పూజలతో నిత్యం పూజలు చేస్తారు.

♦ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

♦ ఈ ఆలయంలో ఎల్లప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది. కానీ అది ఎవరికీ హాని చేయదు.

♦ సత్యానికి మారుపేరుగా కాణిపాక వినాయకుడి పేరును చెబుతూ ఉంటారు. అందుకే అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందు ఉన్న నీటిలో స్నానం చేయిస్తే తప్పు ఒప్పుకొంటాడు అని ప్రసిద్ధి..

♦ ఇక్కడ ఇష్టమైన వాటిని వదిలేస్తే మనం కోరుకున్నది స్వామి వారు తీరుస్తారని భక్తుల నమ్మకం

♦ స్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం కూడా ఉంది.

♦ బస్సు సౌకర్యములు

తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిముషాలకు ఒక బస్సు ఉంది. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును. రైలు సౌకర్యములు: ఆంధ్రప్రదేశ్ ఏమూల నుండి అయిననూ చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరు లకు రైళ్ళు ఉన్నాయి. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభముగా కాణిపాకం చేరవచ్చు.అంతే కాకుండా రేణిగుంట విమానాశ్రయం కూడా కలదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories