Indian Railways Rules: ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నారా.. ఇలా చేస్తే జరిమానాతోపాటు జైలు శిక్ష..!

Indian Railways Rules Passengers Stolen Bed Sheet Blanket Check These Railway Property Act
x

Indian Railways Rules: ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నారా.. ఇలా చేస్తే జరిమానాతోపాటు జైలు శిక్ష..!

Highlights

ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తుంటారు. రైలులో కనిపించే బెడ్ షీట్లు, టవల్స్, దిండ్లు అదృశ్యమవుతున్నాయని రైల్వే శాఖ తరచుగా చెబుతుంది.

Indian Railways Rules: ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తుంటారు. రైలులో కనిపించే షీట్లు, టవల్స్, దిండ్లు అదృశ్యమవుతున్నాయని రైల్వే శాఖ తరచుగా చెబుతుంది. రైల్వేశాఖ ఇచ్చిన బెడ్ షీట్లు, టవల్స్ ను ఇంటికి తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇక నుంచి ఎవరైనా ప్రయాణికుడు అలా చేస్తే రైల్వేశాఖ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈ మేరకు రైల్వే మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏసీ కోచ్‌లలో వినియోగదారులకు షీట్లు, టవల్స్ సౌకర్యాన్ని రైల్వేశాఖ కల్పిస్తున్నప్పటికీ ప్రయాణికుల ఈ చేష్టల వల్ల రైల్వేశాఖ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

రైల్వేలకు లక్షల్లో నష్టం..

ప్రయాణికుల ఈ అలవాట్ల వల్ల ప్రతి ఏడాది రైల్వే శాఖకు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రయాణికులు బెడ్‌షీట్‌లు, దుప్పట్లు, చెంచాలు, కెటిల్‌లు, ట్యాప్‌లు, టాయిలెట్ బౌల్స్‌ను దొంగిలిస్తున్నారని, దీని వల్ల రైల్వేలు భారీ నష్టాన్ని చవిచూస్తాయని రైల్వే తెలిపింది.

ఏ మార్గంలో ఎక్కువ వస్తువులు దొంగిలించబడ్డాయి?

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జోన్‌లోని రైళ్లలో ప్రజలు రైల్వే సామాన్లను విపరీతంగా చోరీ చేస్తున్నారు. బిలాస్‌పూర్‌, దుర్గ్‌ల నుంచి నడిచే సుదూర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో దుప్పట్లు, బెడ్‌షీట్లు, దిండు కవర్లు, ఫేస్‌ టవల్స్‌ దొంగతనానికి గురవుతున్నాయి.

4 నెలల్లో 55 లక్షలు చోరీకి గురయ్యాయని,

బిలాస్‌పూర్ జోన్ నుంచి నడిచే రైళ్లలో గత 4 నెలల్లో సుమారు రూ.55 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. గత నాలుగు నెలల్లో రూ.55 లక్షల 97 వేల 406 విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు తేలుతున్నాయి.

ఎన్ని చోరీ అయ్యాయంటే..

గత నాలుగు నెలల్లో 12886 ఫేస్ టవల్స్ చోరీకి గురయ్యాయి. వీటి ఖరీదు రూ.5,59,381లంట. అదే సమయంలో ఏసీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 4 నెలల్లో 18208 బెడ్‌షీట్లను చోరీ చేశారు. వీటి ధర దాదాపు రూ.2,81,6231లు. ఇది కాకుండా 19767 పిల్లో కవర్లు చోరీకి గురయ్యాయని, వాటి ధర రూ.1,01,4837, 2796 దుప్పట్లు రూ.1171999, 312 దిండ్లు రూ.34,956లుగా తేలింది.

5 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా..

ఈ విధంగా వస్తువులను దొంగిలించడం చట్టపరంగా తప్పు అని రైల్వే తెలిపింది. రైల్వే ప్రాపర్టీ యాక్ట్ 1966 ప్రకారం అలాంటి ప్రయాణికులపై రైల్వే చర్యలు తీసుకుంటుంది. ఇందులో ప్రయాణీకులకు జరిమానాతో పాటు శిక్ష కూడా విధిస్తారు. ఇందులో గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా కూడా విధించబడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories