Indian Railways: రైలు ప్రయాణంలో మద్యం తీసుకెళ్తున్నారా.. షాకిస్తున్న కొత్త రూల్స్..!

Indian Railways: రైలులో ప్రయాణించే వారికి ఒక బిగ్ న్యూస్ వచ్చింది. సాధారణంగా రైలులో ప్రయాణించేప్పుడు అనేక నియమాలను పాటించాల్సి ఉంటుంది.

Jyothi
Updated on: 13 May 2023 8:00 PM IST
Indian Railway Rules Train Journey with Liquor Check these New Rules
X

Indian Railways: రైలు ప్రయాణంలో మద్యం తీసుకెళ్తున్నారా.. షాకిస్తున్న కొత్త రూల్స్..

Indian Railways New Rules: రైలులో ప్రయాణించే వారికి ఒక బిగ్ న్యూస్ వచ్చింది. సాధారణంగా రైలులో ప్రయాణించేప్పుడు అనేక నియమాలను పాటించాల్సి ఉంటుంది. కొంతమంది ప్రయాణికులు మద్యం సేవించి రైలులో ప్రయాణించడం.. లేదా కొన్నిసార్లు రైలులో తమతో పాటు మద్యం తీసుకొని ప్రయాణించడం చాలాసార్లు కనిపిస్తుంది. రైలులో మద్యం తీసుకెళ్లడానికి నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం? అసలు రైలులో మద్యం తీసుకోవచ్చా? లేదా అనే విషయాలు కూడా చూద్దాం..

మద్యం విషయంలో వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు..

రైలులో మద్యం తీసుకువెళ్లడం అనేది మీరు ప్రయాణించే రాష్ట్రంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు మద్యానికి సంబంధించి వేర్వేరు నియమాలను కలిగి ఉన్నాయి. రైల్వే అధికారి సమాచారం అందించగా రైలు, మెట్రో లేదా బస్సు వంటి రవాణా సౌకర్యాల ద్వారా మద్యం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తీసుకురాకూడదు. రైలులో మద్యం తీసుకెళ్లడం పూర్తిగా నిషిద్ధమని ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) దీపక్ కుమార్ సమాచారం ఇచ్చారు. ఎవరైనా రైలులో మద్యం సేవించి ప్రయాణిస్తే, వారిపై రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది.

500 జరిమానా..

భారతీయ రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 165 ప్రకారం ఈ వ్యక్తులపై చర్యలు తీసుకుంటారు. ఇది కాకుండా, రైలులో ఎవరైనా నిషేధిత వస్తువులతో ఉన్నట్లయితే, అతనిపై రూ. 500 జరిమానా కూడా విధించవచ్చు. మరోవైపు ఈ వస్తువు వల్ల ఏదైనా నష్టం జరిగితే, ఆ వ్యక్తి దానిని కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం దేశంలో బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. ఇక్కడ మద్యంతో పట్టుబడితే న్యాయపరమైన చిక్కుల్లో పడవచ్చు. ఇది కాకుండా, మద్యం బాటిల్ తెరిచి ఉంటే, ఆ సందర్భంలో కూడా రైల్వే జరిమానా విధించవచ్చు. ఇది కాకుండా, రైలు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళుతున్నట్లయితే, అది మద్యంకు సంబంధించి పన్ను ఎగవేత కేసు కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో, నేరస్థుడిని జీఆర్ఫీకి అప్పగించి, ఆ తర్వాత ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటుంది.

Jyothi

Jyothi

Next Story