Indian Railway: రైలు ధర ఎంతో తెలుసా? ఇంజన్, బోగీల ధరలు వింటే కచ్చితంగా మూర్ఛ పోవాల్సిందే..!

Indian Railway Facts: భారతీయ రైల్వేలోని ప్రతి రైలులో వివిధ సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి రైలులో వివిధ రకాల కోచ్‌లు ఉంటాయి. దీని ధర రైళ్ల కోచ్, దాని సౌకర్యాలపై ఆధారపడి ఉంటుంది. రైళ్లలో ఉపయోగించే జనరల్ బోగీ, స్లీపర్, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌ల తయారీకి వేర్వేరు ఖర్చులు ఉంటాయి.

Jyothi
Updated on: 19 May 2023 7:30 PM IST
Indian Railway Facts Do you know How Much the Train Cost If you Hear the Prices of the Engine and Bogies
X

Indian Railway: రైలు ధర ఎంతో తెలుసా? ఇంజన్, బోగీల ధరలు వింటే కచ్చితంగా మూర్ఛ పోవాల్సిందే..!

Indian Railway: భారతీయ రైల్వేలోని ప్రతి రైలులో వివిధ సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి రైలులో వివిధ రకాల కోచ్‌లు ఉంటాయి. దీని ధర రైళ్ల కోచ్, దాని సౌకర్యాలపై ఆధారపడి ఉంటుంది. రైళ్లలో ఉపయోగించే జనరల్ బోగీ, స్లీపర్, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌ల తయారీకి వేర్వేరు ఖర్చులు ఉంటాయి.

రైలులో ఇంజిన్ అత్యంత ఖరీదైనది. దాని తయారీకి ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. ప్రస్తుతం, భారతీయ రైళ్లలో రెండు రకాల ఇంజన్లు ఉపయోగిస్తుంటారు. వీటిలో ఎలక్ట్రిక్, డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. నివేదికల ప్రకారం, ఒక ఇంజిన్ తయారు చేయడానికి దాదాపు రూ. 13 నుంచి 20 కోట్లు ఖర్చవుతుంది. అయితే, ఇంజిన్ శక్తిని బట్టి, ధర పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

నివేదికల ప్రకారం, భారతీయ రైల్వే కోసం ఒక కోచ్‌ను సిద్ధం చేయడానికి సగటున రూ. 2 కోట్లు ఖర్చవుతుంది. అయితే బోగీలో కల్పించే సౌకర్యాలను బట్టి ధర ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చు. రైలు సాధారణ కంపార్ట్‌మెంట్‌ను సిద్ధం చేయడానికి కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇందులో తక్కువ సౌకర్యాలు ఉన్నాయి. AC కోచ్‌ను తయారు చేయడానికి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకంటే దీనికి ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తారు.

నివేదికల ప్రకారం రైలు నిర్మాణానికి దాదాపు రూ.66 కోట్లు ఖర్చవుతుంది. ప్యాసింజర్ రైలులో దాదాపు 24 బోగీలు ఉండగా ఒక్కో బోగీకి సగటున రూ.2 కోట్లు ఖర్చవుతుండగా, ఆ బోగీల ధర రూ.48 కోట్లుగా మారింది. దీనితో పాటు రైలు ఇంజన్ ధర సగటున రూ.18 కోట్లుగా ఉంటుంది.

దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ ఇంజిన్‌లెస్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును తయారు చేసేందుకు సగటున రూ.115 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వార్తా సంస్థ PTI నివేదిక ప్రకారం, కొత్త తరం 16-కోచ్ ఇంజన్ లేని సెమీ-హై స్పీడ్ వందే భారత్ రైలును నిర్మించడానికి దాదాపు రూ. 110 నుంచి రూ. 120 కోట్లు ఖర్చవుతుంది.

Jyothi

Jyothi

Next Story