అమ్మకోసం ఉద్యోగాన్ని వదిలేశాడు.... ఆనంద్‌ మహీంద్రా నుండి ఉహించని గిఫ్ట్ పట్టాడు.

అమ్మకోసం ఉద్యోగాన్ని వదిలేశాడు.... ఆనంద్‌ మహీంద్రా నుండి ఉహించని గిఫ్ట్ పట్టాడు.
x
Highlights

సంపాదనలో పడి మనం అందరిని పక్కన పెడుతున్న రోజులివి.. కానీ ఎప్పుడు కాలు కూడా బయటపెట్టని తన తల్లి కోరిక కోసం ఓ కొడుకు ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా...

సంపాదనలో పడి మనం అందరిని పక్కన పెడుతున్న రోజులివి.. కానీ ఎప్పుడు కాలు కూడా బయటపెట్టని తన తల్లి కోరిక కోసం ఓ కొడుకు ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసాడు. తన 20 సంవత్సరాల చేతక్ స్కూటిపై 48,100 కిలోమీటర్ల వరకు తన తల్లిని దేశయాత్రను తీసుకువెళ్ళడానికి సిద్దం అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో వైరల్ గా మారడంతో నాంది ఫౌండేషన్‌ సీఈవో మనోజ్‌ కుమార్‌ ట్వీట్టర్‌లో షేర్‌ చేసారు. దీనిపై ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. అమ్మ పట్ల , దేశం పట్ల అతడికి ఉన్న మంచి ప్రేమ కధ ఇది ... నాకు షేర్ చేసినందుకు ధన్యవాదాలు మనోజ్ .. వీలైతే అతనితో నన్ను కలవనివ్వు.. నేను అతనికి మహీంద్ర కేయూవీ 100 వాహనాన్ని బహుమతిగా ఇస్తాను.

ఈసారి యాత్రకు వెళ్ళేటప్పుడు తన తల్లిని అందులో తీసుకొని వెళ్తాడని ట్వీట్ చేసాడు ఆనంద్‌ మహీంద్రా .. ప్రస్తుతం వీరు ఏడు నెలల పాటు పలు రాష్ట్రాల్లో తమ యాత్రను కొనసాగిస్తున్నారు. ఖరీదైన హోటల్లో కాకుండా అక్కడి మఠాలు, సత్రాల్లో బసచేసేవారు. తమ యాత్ర మధ్యలో తీసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories