Pro Kabaddi league: గుజరాత్ కి యూపీ షాక్!

Pro Kabaddi league: గుజరాత్ కి యూపీ షాక్!
x
Highlights

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో యూపీ యోధ జట్టు గుజరాత్ ఫార్ట్యూన్ జెయింట్స్‌ జట్టుని చిత్తుచేసింది. దీంతో యూపీ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి...

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో యూపీ యోధ జట్టు గుజరాత్ ఫార్ట్యూన్ జెయింట్స్‌ జట్టుని చిత్తుచేసింది. దీంతో యూపీ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. కోల్‌కతాలో సోమవారం జరిగిన పోటీలో యూపీ గుజరాత్ ని 26-33 తేడాతో ఓడించింది. ఈ ఓటమితో గుజరాత్ జట్టు 8 వ స్థానానికి పడిపోయింది.

గుజరాత్ జట్టులో స్టార్ రైడర్ సచిన్ సూపర్-10తో మెరిసినా టీమ్‌ని మాత్రం గెలిపించలేకపోయాడు. మ్యాచ్‌లో 11 సార్లు రైడ్‌కి వెళ్లిన సచిన్.. 10 పాయింట్లను జట్టుకి అందించగా.. డిఫెండర్ సునీల్ 8సార్లు ట్యాకిల్స్‌కి ప్రయత్నించి.. 6 పాయింట్లు సాధించాడు. మరోవైపు యూపీ యోధా జట్టులో శ్రీకాంత్ 6 పాయింట్లతో సరిపెట్టగా.. డిఫెన్స్‌లో సుమిత్ ఐదు పాయింట్లే తెచ్చాడు. అయితే, ఆఖర్లో తప్పిదాలు దిద్దుకున్న యూపీ యోధా.. సమష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది.

ఇక సోమవారమే కోల్‌కతా వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌పై 25-51 తేడాతో పుణెరి పల్టాన్ ఘన విజయాన్ని అందుకుంది. పుణెరి స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ ఏకంగా 26 పాయింట్లతో సత్తాచాటగా.. డిఫెండర్ జైదీప్ ఏడు పాయింట్లు సాధించాడు. తమిళ్ జట్టులో అజిత్ కుమార్ 10 పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories