Pro Kabaddi league: గెలుపు బాటలో పట్నా పైరేట్స్ !

Pro Kabaddi league: గెలుపు బాటలో పట్నా పైరేట్స్ !
x
Highlights

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌‌‌‌లో పట్నా పైరేట్స్ గెలుపు బాట పట్టింది. కోల్‌కతాలో గురువారం రాత్రి జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 36-33 తేడాతో విజయాన్ని అందుకుంది.

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌‌‌‌లో పట్నా పైరేట్స్ గెలుపు బాట పట్టింది. కోల్‌కతాలో గురువారం రాత్రి జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 36-33 తేడాతో విజయాన్ని అందుకుంది. స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ 14 పాయింట్లతో పట్నా గెలుపులో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో 15వ మ్యాచ్ ఆడిన పట్నాకి ఇది ఐదో గెలుపుకాగా.. జైపూర్ టీమ్‌కి ఇది ఏడో ఓటమి.

మ్యాచ్‌లో 19 సార్లు రైడ్‌కి వెళ్లి పర్దీప్ నర్వాల్, 14 పాయింట్లు సాధించాడు. అతనికి తోడుగా 6 పాయింట్లు సాధించి డిఫెండర్ నీరజ్ చక్కని సహకారం అందించాడు. మధ్యలో కాస్త తడబడినట్లు పట్నా కనిపించినప్పటికీ, ఈ ఇద్దరి పట్టుదలతో ఆఖర్లో మళ్లీ పుంజుకుని మ్యాచ్‌ని చేజిక్కించుకోగలిగింది.

సీజన్ ఆరంభంలో అన్ని జట్లపైనా ఆధిపత్యం కనబర్చిన జైపూర్ టీమ్ ఇటీవల మంచి ప్రదర్శన చేయలేకపోతోంది. ఈరోజు మ్యాచ్‌లోనూ స్టార్ రైడర్లందరూ విఫలమవగా.. సుశీల్ గులియా మాత్రమే 8 పాయింట్లతో కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇక డిఫెన్స్‌లో సందీప్ 5 పాయింట్లను టీమ్‌కి అందించగా.. ఆఖర్లో పుంజుకునే అవకాశం వచ్చినా.. జైపూర్ పేలవంగా చేజార్చుకుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories