Chenab River: 2022 నాటికి ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన సిద్ధం

Worlds Highest Rail Bridge Ready by 2022 at Chenab River
x

ఫైల్ ఇమేజ్


Highlights

Chenab River: ఈఫిల్‌ టవర్‌ కన్నా35 మీటర్ల ఎత్తులో రైల్వే బ్రిడ్జి ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Chenab River: జమ్మూ కాశ్మీర్‌లోని చెనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన 2021 నాటికి సిద్ధంగా వుంటుందని, 2022 నాటికి మొదటిసారిగా రైలు ద్వారా లోయను మిగిలిన భారతదేశంతో కలుపుతుందని అధికారులు తెలిపారు. ఈ అంశాన్నికేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం ట్విటర్‌ ద్వారా తెలిపారు. 'దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఇదో అద్భుతం. భారతీయ రైల్వే ఒక గొప్ప మైలురాయిని సాధించడానికి సిద్ధంగా ఉంది. ఇంజినీర్ల సామర్థ్యానికి ఈ బ్రిడ్జ్‌ చిహ్నంగా నిలిచిపోతుంది. దీని నిర్మాణ పనులు 2021 మార్చి నాటికి పూర్తవుతాయి' అని మంత్రి ట్వీట్‌ చేశారు.

నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్‌ ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్‌ టవర్‌ కన్నా35 మీటర్ల ఎత్తులో ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కొంకణ్‌ రైల్వే ఆధ్వర్యంలో ఉద్ధమ్‌పూర్‌-శ్రీనగర్‌-బారముల్లా రైల్వే లింక్‌ ప్రాజెక్టు కింద 111 కిలోమీటర్ల విస్తీర్ణంలో బ్రిడ్జ్‌ నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2004లోనే దీని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాగా ఈ ప్రాంతంలో గాలి వేగం అధికంగా ఉండటంతో రైలు ప్రయాణీకుల భద్రత దృష్ట్యా 2008-09 కాలంలో పనులు నిలిచిపోయినట్లు రైల్వే శాఖ తెలిపింది. 2017 నుంచి వంతెనకు స్టీల్‌ ఆర్చ్‌ను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్‌ ద్వారా జమ్ము, కశ్మీర్‌ ప్రాంతాల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలను తక్కువ సమయంలో చేరుకోవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories