బావిలో పడిన బాలుడు.. రక్షించేందుకు వెళ్లి 40 మంది బావిలో..

Villagers Fell into Well During Rescue Operation in Madhya Pradesh
x

బావిలో పడిన బాలుడు.. రక్షించేందుకు వెళ్లి 40 మంది బావిలో..

Highlights

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాలికను రక్షించేందుకు వెళ్లి 40 మంది బావిలో పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 19 మందిని స్థానికులు కాపాడారు. గంజ్‌బసోడ గ్రామంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఓ బాలిక ప్రమాదవశాత్తూ బావిలో పడింది. 50 అడుగుల లోతున్న ఆ బావిలో 20 అడుగుల వరకు నీరుంది. బాలిక పడిపోయిన విషయం తెలియగానే రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. మరికొందరు బావి గోడ దగ్గర నిలబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బావి గోడ కూలిపోయింది. దీంతో వారంత బావిలో పడిపోయారు. వారిలో కొంతమందిని బయటకు తీశారు. మరికొందరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సీఎం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయాలతో పాటు మెరుగైన వైద్యం అందించనున్నాట్టు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories