Vande Bharat: పట్టాలపై తాగినోడి ఆటో.. తృటిలో తప్పిన వందే భారత్ ఘోర ప్రమాదం!

Vande Bharat Express: కేరళలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

Arun Chilukuri
Published on: 24 Dec 2025 12:53 PM IST
Vande Bharat: పట్టాలపై తాగినోడి ఆటో.. తృటిలో తప్పిన వందే భారత్ ఘోర ప్రమాదం!
X

Vande Bharat: పట్టాలపై తాగినోడి ఆటో.. తృటిలో తప్పిన వందే భారత్ ఘోర ప్రమాదం!

Vande Bharat Express: కేరళలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పట్టాలపై ఆగి ఉన్న ఆటోను గమనించిన లోకోపైలట్ అత్యవసర బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది.

అసలేం జరిగిందంటే?

మంగళవారం రాత్రి 10.10 గంటల సమయంలో తిరువనంతపురంలోని అకతుమురి హాల్ట్ స్టేషన్ సమీపంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగంగా వెళ్తుండగా, పట్టాలపై ఒక ఆటో ఆగి ఉండడాన్ని లోకోపైలట్‌ గుర్తించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రైలు ఆగిపోయింది. అయితే రైలు వేగానికి ఆటోలోని కొంత భాగం దెబ్బతిన్నప్పటికీ, ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

మద్యం మత్తులో డ్రైవర్!

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుధి అనే ఆటో డ్రైవర్ విపరీతంగా మద్యం సేవించి, పట్టాలపై ఆటోను ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) మరియు స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆటోను పట్టాలపై నుంచి తొలగించారు. ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

నిలిచిపోయిన రైలు ప్రయాణం

ఈ ఘటన కారణంగా ట్రాక్ తనిఖీలు ముగిసే వరకు రైలును అక్కడే నిలిపివేశారు. భద్రతను నిర్ధారించుకున్న తర్వాత రాత్రి 11.15 గంటలకు వందే భారత్ ప్రయాణం తిరిగి ప్రారంభమైంది. లోకోపైలట్ సమయస్ఫూర్తిని ప్రయాణికులు మరియు రైల్వే అధికారులు ప్రశంసిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story