UPSC Prelims 2021: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలపై యూపీఎస్సీ కీలక ప్రకటన

UPSC Prelims 2021: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 13 May 2021 4:41 PM IST
UPSC Prelims 2021 Exam Postponed to October 10
X

UPSC Prelims 2021: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలపై యూపీఎస్సీ కీలక ప్రకటన


UPSC Prelims 2021: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్ 27 ప్ర్రిలిమినరీ పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. దేశంలో కోవిడ్ సెకెండ్ వేవ్ నడుస్తుండటం, కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు యూపీఎస్‌సీ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 27న జరగాల్సిన పరీక్షను అక్టోబర్‌ 10న నిర్వహించాలని నిర్ణయించినట్టు కమిషన్‌ వెల్లడించింది. కరోనా ఉగ్రరూపం కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ కు అవకాశం కల్పిస్తారు. మెయిన్స్ లో ర్యాంకు సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి సివిల్ సర్వీసెస్ కు యూపీఎస్సీ ఎంపిక చేస్తోందన్న విషయం తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story