Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. విశ్వకర్మ పథకానికి కేబినెట్‌ ఓకే.. దేశ వ్యాప్తంగా 10 వేల ఎలక్ట్రిక్ బస్సులు

Union Cabinet Approves PM Vishwakarma Scheme
x

Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. విశ్వకర్మ పథకానికి కేబినెట్‌ ఓకే.. దేశ వ్యాప్తంగా 10 వేల ఎలక్ట్రిక్ బస్సులు

Highlights

Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఈ-బస్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఈ-బస్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం 57 వేల 613 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. పీఎం ఈ-బస్ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 10 వేల ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా వంద పట్టణాల్లో ఈ-బస్సులు అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. ఈ-బస్‌ల ద్వారా పట్టణాల్లో రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకుంది.

మరో వైపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ విశ్వకర్మలకు ఆర్థికసాయంపై కూడా నిర్ణయం తీసుకుంది కేబినెట్. ‎ఈ పథకంలో భాగంగా చేతివృత్తుల వారికి రుణాలు అందించనుంది. ఈ పథకానికి 13 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే.. దేశవ్యాప్తంగా 7 రైల్వే మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 32 వేల 500 కోట్లతో 2 వేల 339 కిలో మీటర్ల మేర ట్రాకింగ్ పనులు చేపట్టనున్నారు. దీని ద్వారా ఏపీ, తెలంగాణతో పాటు 9 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories