కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
x
Highlights

Cabinet Decisions: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు...

Cabinet Decisions: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ మీడియాకు వివరించారు. మిషన్‌ కర్మయోగి పేరిట సివిల్‌ సర్వీసుల ప్రక్షాళనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. సివిల్‌ సర్వీసులపై కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. సివిల్‌ సర్వీసుల సామర్థ్య పెంపు కోసం జాతీయ కార్యక్రమంగా మిషన్‌ కర్మయోగిని ప్రభుత్వం చేపడుతుందని మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వెల్లడించారు. పౌర అధికారులను మరింత సృజనశీలురుగా, నిర్మాణాత్మకంగా, చురుకుగా, పారదర్శకంగా ఉండేలా దేశ భవిష్యత్‌ కోసం వారిని దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మిషన్‌ కర్మయోగిని ప్రారంభిస్తున్నామని చెప్పారు. వారు మరింత ఉత్తేజంగా, సాంకేతిక అంశాలపై పట్టు సాధించేలా ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని అన్నారు.

ప్రపంచంలో అత్యంత మెరుగైన విధానాలను ఒంటబట్టించుకునే పౌర అధికారులు భారత సంస్కృతి, విధానాలకు అనుగుణంగా వాటిని మెరుగుపరిచే క్రమంలో సామర్థ్య పెంపు దోహదపడుతుందని తెలిపారు. జమ్ముకశ్మీర్‌ అధికార భాషల బిల్లును కూడా కేబినెట్‌ ఆమోదించింది. అధికార భాషలుగా ఉర్దూ, కశ్మీర్‌, డోగ్రీ, హిందీ, ఇంగ్లీష్‌ భాషలు ఉంటాయి. మరోవైపు జపాన్, ఫిన్‌లాండ్‌, డెన్మార్క్‌లతో వరుసగా జౌళి శాఖ, గనులు, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖల ప్రతిపాదిత మూడు ఎంఓయూలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందని తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories