ఉదంపూర్ ఎక్స్ ప్రెస్ రైలు లో చెలరేగిన మంటలు.. రెండు బోగీలు పూర్తిగా దగ్ధం..

Udhampur Durg Express Catches Fire in Madhya Pradesh
x

ఉదంపూర్ ఎక్స్ ప్రెస్ రైలు లో చెలరేగిన మంటలు.. రెండు బోగీలు పూర్తిగా దగ్ధం..

Highlights

Durg-Udhampur Express: మధ్యప్రదేశ్‌లో పెనుప్రమాదం తప్పింది.

Durg-Udhampur Express: మధ్యప్రదేశ్‌లో పెనుప్రమాదం తప్పింది. ఉదంపూర్‌-దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఎ-1, ఎ-2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో మూడు బోగీలకు మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆ బోగీలను వేరు చేశారు. ప్రయాణికులను హుటాహుటిన కిందకు దించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. హేతంపూర్‌ స్టేషన్‌ నుంచి వెళ్లిన కాసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదం దృష్ట్యా ఆ రూట్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories