Coronavirus: భారత్ లో మరో ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలు.. ఢిల్లీ, తెలంగాణ లలో..

Coronavirus: భారత్ లో మరో ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలు.. ఢిల్లీ, తెలంగాణ లలో..
x
Highlights

భారత్ లో మరో ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయి.

భారత్ లో మరో ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయి. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు భారత ఆరోగ్య శాఖ లేఖ విడుదల చేసింది. వారిని చికిత్స కోసం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 28 రోజులపాటు వారు నిర్బంధంలోనే ఉండనున్నారు. మరోవైపు తాజాగా మరో రెండు కేసులు నమోదు కావడంతో భారత్ అప్రమత్తమైంది.

భారతదేశంలో మొత్తం 1,671 మందిని విదేశాలనుంచి ఇండియాకు వచ్చిన వారిని పరీక్షించారు. అందులో మూడు ధృవీకరించబడిన కేసులు నమోదయ్యాయి. ధృవీకరించబడిన కరోనావైరస్ ఉన్న ముగ్గురూ కేరళకు చెందినవారు ఇప్పటికే వారు నిర్బంధంలో ఉన్నారు. తాజాగా మరో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉండటంతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. ఇదిలావుంటే చైనాలో కరోనా మహమ్మారి ద్వారా మరణించిన వారి సంఖ్యా 2800 కు పైగా ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 3,000 దాటింది. ఈ వైరస్ ఇప్పుడు 88,000 మందికి పైగా సోకింది.. 60 కి పైగా దేశాలకు వ్యాపించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories