ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్‌ రైలును ఢీకొట్టిన గూడ్స్‌ రైలు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 4 Nov 2025 5:11 PM IST
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్‌ రైలును ఢీకొట్టిన గూడ్స్‌ రైలు
X

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్‌ రైలును ఢీకొట్టిన గూడ్స్‌ రైలు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ రైలును గూడ్స్ రైలు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని అధికారులు తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే అధికారులు మరియు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story