
ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం నేడు భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 5,000 మార్కును దాటింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం నేడు భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 5,000 మార్కును దాటింది. గత 24 గంటల్లో 773 కొత్త అంటువ్యాధులు నమోదైన తరువాత దేశంలో మొత్తం కోవిడ్ -19 కేసులు 5,194 కు పెరిగాయి.
మరణాల సంఖ్య 149 కు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చూపించగా, 401 మంది రోగులకు నయం అయి.. డిశ్చార్జ్ అయ్యారు. 1,018 కేసులతో మహారాష్ట్ర అత్యధిక కేసులున్న రాష్ట్రం కాగా.. తమిళనాడు 690, ఢిల్లీ 576, తెలంగాణ 404, కేరళ 336 కేసులతో ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. గత నెలలో ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన సుమారు 1,500 మందికి కరోనావైరస్ సోకింది.
భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు రాష్ట్రాల వారీగా ఇలా ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్ - 329
అండమాన్ మరియు నికోబార్ దీవులు - 10
అరుణాచల్ ప్రదేశ్ - 1
అస్సాం -27
బీహార్ - 38
చండీగర్ - 18
ఛత్తీస్గడ్ - 10
ఢిల్లీ - 576
గోవా - 7
గుజరాత్ - 165
హర్యానా - 147
హిమాచల్ ప్రదేశ్ -18
జమ్మూ కాశ్మీర్ - 116
జార్ఖండ్ -4
కర్ణాటక - 175
కేరళ - 336
లడఖ్ - 14
మధ్యప్రదేశ్ - 229
మహారాష్ట్ర - 1018
మణిపూర్ - 2
మిజోరం - 1
ఒడిశా - 42
పుదుచ్చేరి - 5
పంజాబ్ - 91
రాజస్థాన్ - 328
తమిళనాడు - 690
తెలంగాణ - 404
త్రిపుర - 1
ఉత్తరాఖండ్ - 31
ఉత్తర ప్రదేశ్ - 326
పశ్చిమ బెంగాల్ - 99

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



