West Bengal: నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థిపై తృణమూల్‌ ఫిర్యాదు

TMC writes to EC, Suvendu Adhikari Harbouring Criminals in Nandigram
x

West Bengal: నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థిపై తృణమూల్‌ ఫిర్యాదు

Highlights

West Bengal: నందిగ్రామ్‌ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

West Bengal: నందిగ్రామ్‌ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 40 నుంచి 50 మంది కిరాయి గూండాలకు సువేందు అధికారి ఆశ్రయం ఇచ్చారని ఈసీకి లేఖ రాసింది. సువేందు కిరాయికి తెచ్చిన నేరగాళ్లు ఎవరూ నందిగ్రామ్‌ నివాసులు కారని తెలిపింది. వీరంతా నాలుగు ప్రాంతాల్లో ఉంటున్నారంటూ ఆ వివరాలను కూడా టీఎంసీ షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఇచ్చినప్పటికీ.. ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని టీఎంసీ ఆరోపించింది. బయట ప్రాంతాల నుంచి సువేందు తీసుకువచ్చిన సంఘ వ్యతిరేక శక్తుల్ని అరెస్ట్‌ చేసేలా పోలీసులను ఆదేశించాలని ఈసీని తృణమూల్ కాంగ్రెస్ కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories