దారుణం.. భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త

Odisha: అంబులెన్స్‌కు డబ్బులు లేక పాడెతో మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు

Jyothi
Published on: 28 Jan 2024 11:47 AM IST
The Husband Carried his Wife DeadBody for 20 Kilometers in Odisha
X

దారుణం.. భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త 

Odisha: ఒడిశా కోరాపుట్‌ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పూర్ణగూడెం పంచాయతీ కుమిలి గ్రామంలో పుట్టింట్లో వివాహిత కరుణ అమృత్యో అనారోగ్యంతో చనిపోయింది. అయితే వారి సంప్రదాయం ప్రకారం అత్తగారి ఊరైన నవరంగాపూర్‌ జిల్లాలోని నందాహుండీ సమితి జగన్నాథ్‌పూర్‌ పంచాయతీ పుష్పంగలో అంత్యక్రియలు జరుపాలని పెద్దలు నిర్ణయించారు. అయితే మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ అంబులెన్స్ లభించలేదు. ప్రైవేట్ అంబులెన్స్‌లో తరలించడానికి ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. దీంతో భర్త , కుటుంబ సభ్యులు పాడే ద్వారా 20కిలోమీటర్ల దూరంలోని అత్తగారి ఊరుకు తరలించడం కలచి వేసింది.

Jyothi

Jyothi

Next Story