Do not send trains from Gujarat: గుజరాత్ నుండి రైళ్లను పంపవద్దంటూ మూడు రాష్ట్రాలు..

Do not send trains from Gujarat: గుజరాత్ నుండి రైళ్లను పంపవద్దంటూ మూడు రాష్ట్రాలు..
x
Highlights

Do not send trains from Gujarat: దేశవ్యాప్తంగా కరోనాకేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల పరంగా మూడోస్థానంలోకి భారత్ చేరుకుంటోంది.

Do not send trains from Gujarat: దేశవ్యాప్తంగా కరోనాకేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల పరంగా మూడోస్థానంలోకి భారత్ చేరుకుంటోంది. దీనికి కారణం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడమే అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ , గుజరాత్ రాష్ట్రాలలో వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గడ్ ప్రభుత్వాలు అహ్మదాబాద్, సూరత్ గుండా వచ్చే రైళ్లు తమ రాష్ట్రానికి రావొద్దని రైల్వే శాఖను కోరుతున్నారు. ఈ రైళ్ల ద్వారా తమ రాష్ట్రాల్లో సంక్రమణ మరింతగా పెరుగుతోందని అంటున్నారు. రైలు ఫ్రీక్వెన్సీని తగ్గించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లేఖ రాసింది. దాంతో అహ్మదాబాద్-హౌరా మెయిల్‌ను వారంలో ఒకరోజు మాత్రమే నడపనున్నట్టు రైల్వే శాఖ తెలియజేసింది. ఇప్పటివరకు అహ్మదాబాద్‌లో 21 వేలకు పైగా, సూరత్‌లో 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఛత్తీస్‌గడ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ప్రతిరోజూ వస్తున్న ఏకైక రైలు అహ్మదాబాద్-హౌరా మెయిల్. దీంతో ప్రయాణికులు కూడా భారీగానే ఉంటున్నారు.

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం తరపున ప్రభుత్వ కార్యదర్శి.. రైల్వే బోర్డుకు లేఖ రాశారు. గుజరాత్, మహారాష్ట్రలలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని అందులో పేర్కొన్నారు. ముంబై నుండి హౌరాకు, అహ్మదాబాద్ నుండి సూరత్ వరకు హౌరా ద్వారా ఒక సాధారణ రైలు ఉంది. ఈ రైళ్ల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు బెంగాల్‌కు వస్తున్నారు. ఇది బెంగాల్‌లో సంక్రమణ మరింత ఎక్కువవుతోందని పేర్కొన్నారు. మరోవైపు అహ్మదాబాద్ నుండి సూరత్ మీదుగా నడుస్తున్న అహ్మదాబాద్-హౌరా మెయిల్ ఇప్పుడు వారానికి ఒక రోజు మాత్రమే నడవనుంది. ఇది ప్రతి శుక్రవారం హౌరా నుండి, ప్రతి సోమవారం అహ్మదాబాద్ నుండి బయలుదేరుతుంది. అయితే తేదీని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ఈ రైలు మధ్యాహ్నం 12.15 గంటలకు అహ్మదాబాద్ నుండి బయలుదేరి తెల్లవారుజామున 4.15 గంటలకు సూరత్ చేరుకుని రెండవ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు హౌరా చేరుకుంటుంది. రాత్రి 11.55 గంటలకు హౌరా నుండి నడుస్తూ, సూరత్ రెండవ రోజు ఉదయం 9 గంటలకు అహ్మదాబాద్‌కు, అదే రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. ఇది అహ్మదాబాద్ నుండి రాయ్‌పూర్, ఛత్తీస్‌గడ్ లోని బిలాస్‌పూర్ , ఒడిశాలోని రూర్కెలా మీదుగా సూరత్‌కు చేరుకుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories