మోడీ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు.. విజయ్‎ని తామే చంపామన్న కె.ఎఫ్.ఎఫ్. ఆర్గనైజేషన్

Terrorist Group Kashmir Freedom Fighters has Claimed Responsibility for the killing of Bank Manager
x

మోడీ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు.. విజయ్‎ని తామే చంపామన్న కె.ఎఫ్.ఎఫ్. ఆర్గనైజేషన్

Highlights

Kashmir Freedom Fighters: విజయ్ కుమార్ అనే బ్యాంక్ ఎంప్లాయీని తామే హత్య చేశామని కె.ఎఫ్.ఎఫ్. అనే టెర్రరిస్టు సంస్థ ప్రకటించింది.

Kashmir Freedom Fighters: విజయ్ కుమార్ అనే బ్యాంక్ ఎంప్లాయీని తామే హత్య చేశామని కె.ఎఫ్.ఎఫ్. అనే టెర్రరిస్టు సంస్థ ప్రకటించింది. ఈ ఉదయం తమ టీము సభ్యులే రెక్కీ నిర్వహించారని, అక్కడ బ్యాంకులో నాన్-కాశ్మీరీ ఉద్యోగం చేస్తున్నాడని నిర్ధారించుకున్నాకే చంపామని కాశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనే ఆర్గనైజేషన్ ఓ బహిరంగ లేఖలో పేర్కొంది. కాశ్మీర్ లో కాశ్మీరేతరులు ఎవరు ఉద్యోగాలు చేసినా, నివాసం ఉన్నా ఇలాంటి గతే పడుతుందని బహిరంగంగా పేర్కొంది.

కాశ్మీర్ లో నివసిద్దామని కలలు గనేవారికి ఆ క్షణమే కాలం చెల్లిపోతుందని గుర్తు పెట్టుకోవాలని ఘాటుగా పేర్కొన్నారు. ఈ విషయంలో మోడీని నమ్మి ప్రాణాలు కోల్పోవద్దని ప్రజలకు తెలియజేసింది. ఇప్పుడీ లేఖతో కాశ్మీర్ లోయలో భీతావహమైన వాతావరణం నెలకొంది. హిందువులంతా ఇప్పటికే కాశ్మీర్ ను వీడి వెళ్లిపోతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories