Viral News: విద్యార్థుల ముందు 'జై శ్రీరామ్‌' నినాద వివాదం.. చిక్కుల్లో గవర్నర్‌..!

తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి విద్యార్థుల ముందు జై శ్రీరామ్ నినాదాన్ని ప్రోత్సహించడంపై తీవ్ర వివాదం నెలకొంది. ఇది రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉందంటూ డీఎంకే, కాంగ్రెస్ విమర్శలు గుప్పించాయి.

Mowgli
Updated on: 13 April 2025 8:30 PM IST
Viral News: విద్యార్థుల ముందు జై శ్రీరామ్‌ నినాద వివాదం.. చిక్కుల్లో గవర్నర్‌..!
X

తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి చేసిన వ్యాఖ్యలు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. మధురైలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, విద్యార్థులను జై శ్రీరామ్ అనే నినాదం చేయాలని కోరారు. కంబ రామాయణం రచించిన ప్రాచీన కవి ఆజ్ఞాపించిన సంస్కృతిని గౌరవించడమే తన ఉద్దేశమని రవి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అయితే గవర్నర్ వ్యాఖ్యలపై అధికార డీఎంకే పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన మతపరమైన నేతలలాగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించింది. రవి వ్యవహారం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని, ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ కేంద్రంలోని ఆరెస్సెస్ ఆజెండాను ప్రజలపై తేవాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆస్సాన్ మౌలానా కూడా గవర్నర్ పై ధ్వజమెత్తారు. భారతదేశం మతాల, భాషల, సముదాయాల విభిన్నతను కలిగి ఉన్న దేశమని, అలాంటి దేశంలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మతపరమైన నినాదాలను ప్రోత్సహించడం తగదు అన్నారు. విద్యార్థులకు జై శ్రీరామ్ నినాదాన్ని చెప్పమంటూ చెప్పడం అసమానతకు దారి తీస్తుందని మండిపడ్డారు.

ఈ వివాదం ముందు కొన్ని రోజులకే సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఆమోదం పొందిన పది బిల్లులను గవర్నర్ పట్టివేయడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా గవర్నర్లు ఆలస్యం చేయడం చట్టవిరుద్ధమని వెల్లడించింది. ఇది డీఎంకే ప్రభుత్వానికి ఓ న్యాయ విజయం అయ్యింది.

Mowgli

Mowgli

Next Story