Tamil Nadu: తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం

Tamil Nadu CM Stalin Key Decision
x

తమిళనాడు సీఎం స్టాలిన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Tamil Nadu: కరోనా కట్టడికి 13 మందితో కమిటీ ఏర్పాటు * కమిటీలో 12 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు చోటు

Tamil Nadu: అధికారంలో వచ్చాక అమ్మ కేంటీన్లను కొనసాగిస్తూ ఇప్పటికే ప్రశంసలు అందుకున్న స్టాలిన్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ భయంకరంగా విజృంభిస్తున్న వేళ దాని అణచివేతకు సీఎం చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 13 మందితో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకరంగా ఈ కమిటీలో ఏకంగా 12 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు చోటిచ్చారు.

ఈ కమిటీలో అధికార పార్టీ నుంచి డాక్టర్ ఎళిలన్‌కు మాత్రమే చోటు లభించింది. నిజానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే కమిటీలు అధికార పార్టీ సభ్యులతో నిండిపోతుంటాయి. ప్రతిపక్ష నేతలకు తూతూమంత్రంగా అవకాశం ఇస్తారు. అయితే, స్టాలిన్ ఆ పద్ధతిని మార్చేశారు. విమర్శలకులు సైతం హర్షించేలా రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories