Black Fungus: ముంచుకొస్తున్న బ్లాక్ ఫంగస్.. బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎలా వుంటాయి..?

Black Fungus: ముంచుకొస్తున్న బ్లాక్ ఫంగస్.. బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎలా వుంటాయి..?
Black Fungus: ఓ పక్క కరోనా మహమ్మారితో దేశమంతా ఉక్కిరిబిక్కిరవుతుంటే ఇది చాలదన్నట్టు ఇప్పడు బ్లాక్ ఫంగస్ ముప్పు ముంచుకొస్తోంది.
Black Fungus: ఓ పక్క కరోనా మహమ్మారితో దేశమంతా ఉక్కిరిబిక్కిరవుతుంటే ఇది చాలదన్నట్టు ఇప్పడు బ్లాక్ ఫంగస్ ముప్పు ముంచుకొస్తోంది. అరుదుగా వచ్చే ఈ ఫంగస్ కరోనా వైరస్ కారణంగా మరింత ప్రమాదకరంగా మారుతోంది. కోవిడ్ బారి నుంచి కోలుకున్నప్పటికీ బ్లాక్ ఫంగస్ రూపంలో మృత్యువు వెంటాడుతోంది. దేశంలో ముందుగా గుజరాత్లో కనిపించిన ఫంగస్ తర్వాత ఢిల్లీ, మహారాష్ట్రకూ పాకింది. ఇప్పుడు తెలంగాణలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదుకావడం భయాందోళనకు గురిచేస్తోంది.
కరోనా వైరస్ ముప్పుతో పాటు ఇప్పుడు దేశాన్ని బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. అరుదుగా వచ్చే ఈ మ్యూకోర్ మైకోసిస్ ఫంగస్ ప్రమాదకరమైనదేనని ఇప్పటికే నిపుణులు వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న లేదా కోలుకుంటున్నవారిలో ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. కొవిడ్ వ్యాధి చికిత్సలో స్టెరాయిడ్లు అధికంగా వాడటం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. తలనొప్పి, జ్వరం, కళ్ల కింద నొప్పి, ముక్కు మూసుకుపోవడం, దగ్గు, ఊపిరి తీసుకోలేకపోవడం, పాక్షికంగా చూపు కోల్పోవడం వంటివి బ్లాక్ ఫంగస్ లక్షణాలు.
కరోనా సెకండ్వేవ్ ధాటికి విలవిలలాడుతున్న మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్టు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యాధి బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకు 52 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 8 మంది చూపు కోల్పోయారని తెలిపారు. వీరంతా కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారేనని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో 15వందల వరకూ బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్టు వైద్యాధికారులు ప్రకటన చేశారు.
మహారాష్ట్రతో పాటు గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొలి కేసు, తొలి మరణం కూడా రికార్డు కావడం రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. భైంసాలో బ్లాక్ ఫంగస్ బారిన పడి ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగా తక్కువ ఉన్నవాళ్లకు, షుగర్ ఉన్న కరోనా పేషెంట్లకు, క్యాన్సర్ బాధితులకు ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువని డాక్టర్లు చెబుతున్నారు.
ఇక.. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతుండడంతో దాని నివారణ, నియంత్రణపై కేంద్ర ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది. బ్లాక్ ఫంగస్ లక్షణాలు, దాని బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోకితే తీసుకునే చర్యల వంటి వాటిపై ట్విట్టర్లో పలు వివరాలను వెల్లడించింది. ఎక్కువగా అనారోగ్యంతో బాధపడే వారికే బ్లాక్ ఫంగస్ సోకుతోంది. ఇతర రోగకారక క్రిములతో పోరాడే శక్తిని తగ్గించేస్తోంది. ఇతర వాధ్యులు, మధుమేహం ఎక్కువగా ఉన్నవారు, స్టెరాయిడ్లు వాడకంతో ఇమ్యూనిటీ తగ్గిపోయినవారు, ఐసీయూలో ఎక్కువ కాలం ఉన్న వారికి బ్లాక్ ఫంగస్ ఎక్కువగా సోకుతోందని స్పష్టం చేసింది.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆకస్మికంగా తనిఖీ చేసిన టీటీటీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఆ...
29 May 2022 4:45 AM GMTప్రపంచంలోనే అతిపెద్ద మైదానంగా నరేంద్రమోదీ స్టేడియం పేరు...
29 May 2022 4:30 AM GMTరేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ - వైఎస్ షర్మిల
29 May 2022 4:15 AM GMTఏపీ సీఎస్ కు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ...
29 May 2022 3:55 AM GMTతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 16 గంటల సమయం...
29 May 2022 3:16 AM GMT