నేడు అసంతృప్తి నేతలతో సోనియాగాంధీ భేటీ

నేడు అసంతృప్తి నేతలతో సోనియాగాంధీ భేటీ
x
Highlights

పార్టీ అగ్రనాయకత్వంపై లేఖాస్త్రం సంధించి తిరుగుబావుటా ఎగురువేసిన సీనియర్లతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇవాళ భేటీ కానున్నారు. రెండురోజులపాటు...

పార్టీ అగ్రనాయకత్వంపై లేఖాస్త్రం సంధించి తిరుగుబావుటా ఎగురువేసిన సీనియర్లతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇవాళ భేటీ కానున్నారు. రెండురోజులపాటు 23మంది నేతలతో ఆమె సమావేశాలు జరపనున్నారు. అసమ్మతి నేతలు లేవనెత్తిన అంశాలతోపాటు పార్టీ ప్రక్షాళన, సంస్థాగత ఎన్నికలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో రాహుల్‌గాంధీ కూడా పాల్గొననున్నారు.

రాహుల్‌కు పార్టీ పగ్గాలు తిరిగి అప్పగించడానికి ఓ ప్రణాళిక ప్రకారం ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీకి ఓ మంచి టీమ్‌ ఏర్పాటు చేసి కీలకాంశాలపై సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లేలా వ్యూహరచన సాగించాలని సోనియాగాంధీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.


Show Full Article
Print Article
Next Story
More Stories