ఈడీ విచారణకు హాజరు కానున్న సోనియా

Sonia Gandhi to Attend the ED Investigation
x

ఈడీ విచారణకు హాజరు కానున్న సోనియా

Highlights

Sonia Gandhi: ఈనెల 21 తేదీన తొలిసారి విచారణకు హాజరు

Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణకు మరోసారి హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నగదు అక్రమ చెలామణికి సంబంధించి ధర్యాప్తు సంస్థ అధికారులు సోనియా గాంధీని ప్రశ్నించనున్నారు. ఈనెల 21 తేదీన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరైన సోనియా వెంట ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ హాజరయ్యారు. అడిషనల్ డైరెక్టర్ హోదాలోఉన్న మహిళా అధికారి ఆధ్వర్యంలో జరిగే విచారణలో ఐదుగురు అధికారుల బృందం పాల్గొంటుంది.

నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమ లావాదేవీలు జరిగాయని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్రతో ధర్యాప్తు సంస్థతో విచారణ చేయిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈడీ చర్యలను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యదర‌్శులు నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories