ఒకే ఇంట్లో ఆరుగురు వ్యక్తులు మృతి.. మిస్టరీగా మారిన..

Six of Family Found Dead at home in Sidhra
x

ఒకే ఇంట్లో ఆరుగురు వ్యక్తులు మృతి.. మిస్టరీగా మారిన..

Highlights

Family Found Dead: జమ్మూకశ్మీర్‌లో దారుణం జరిగింది. సిద్రా ఏరియాలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఆరు మంది మృతిచెందారు.

Family Found Dead: జమ్మూకశ్మీర్‌లో దారుణం జరిగింది. సిద్రా ఏరియాలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఆరు మంది మృతిచెందారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అందాల్సి ఉందని పోలీసులు తెలిపారు. జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీకి ఆ మృతదేహాలను తరలించారు. నిన్న ఉగ్రవాదులు సోఫియాన్ జిల్లాలో కశ్మీర్ పండిట్లపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో ఓ కాశ్మీర్ పండిట్ చనిపోగా అతని సోదరుడు గాయపడ్డాడు. మృతున్ని సునీల్ కుమార్ భట్‌గా గుర్తించారు. గాయపడ్డ వ్యక్తి పింటుగా గుర్తించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతను మరింత పెంచారు పోలీసులు. అయితే ఒకే ఇంట్లో ఆరుగురు వ్యక్తులు చనిపోవడం ఓ పెద్ద మిస్టరీగా మారింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories