గవర్నర్‌తో ఉద్ధవ్ ఠాక్రే దంపతులు భేటీ

గవర్నర్‌తో ఉద్ధవ్ ఠాక్రే దంపతులు భేటీ
x
Uddhav Thackeray, Governor Bhagat Singh Koshyarini
Highlights

మహారాష్ట్ర కాబోయే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన భార్య రష్మీ రాజ్‌భవన్‌‌లో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని మర్యాదపూర్వకంగా కలిశారు.

మహారాష్ట్ర కాబోయే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన భార్య రష్మీ రాజ్‌భవన్‌‌లో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని మర్యాదపూర్వకంగా కలిశారు.అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుండగా.. మహా వికాస్‌ అఘాది తరపున సీఎంగా ఉద్ధవ్‌ ఠాక్రే 28వ తేదీ గురువారం ముంబైలోని శివాజీ పార్కులో ప్రమాణం చేయనున్నారు. కాగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మంగళవారం ఉద్ధవ్ ఠాక్రేను కూటమి నేతగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే.

మూడు పార్టీలు నేతలు వెళ్లి తమకు 166మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు తెలిపారు. అంతకు ముందు సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఉపముఖ‌్యమంత్రి పదవికీ ఎన్సీపీ నేత అజిత్ పవార్ రాజీనామా చేశారు. అనంతరం సీఎం పదవికీ ఫడ్నవీస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories