SBI: జూలై 1 నుంచి ఎస్‌బీఐ కొత్త ఛార్జీలు

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు హెచ్చరిక. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ కస్టమర్లకు విధించే ఛార్జీలను మార్చింది.

Venkata Chari
Updated on: 25 May 2021 9:45 PM IST
SBI New Charges for Cash Withdrawals on July 1st
X

ఎస్‌బీఐ బ్యాంక్ (ఫొటో ట్విట్టర్)

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు హెచ్చరిక. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ కస్టమర్లకు విధించే ఛార్జీలను మార్చింది. ఏటీఎంలో మనీ విత్‌డ్రా చేయడం, చెక్‌బుక్, ఇతర ఆర్థిక లావాదేవీలకు జూలై 1 నుంచి నూతన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈమేరకు ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో సవరించిన ఛార్జీలను పొందుపరిచింది.

ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ హోల్డర్లకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు ను అందిస్తుంది. ఒక నెలలో 4 సార్లు ఉచితంగా బ్యాంక్ బ్రాంచ్‌లో, ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు డ్రా చేస్తే సర్వీస్ ఛార్జీ చెల్లించాలి. జూలై 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీ రూ.15+GST వర్తిస్తుంది. అంటే ఎస్‌బీఐ, నాన్ ఎస్‌బీఐ ఏటీఎంలల్లో, బ్రాంచ్‌లో కలిపి ఒక నెలలో 4 సార్లు మాత్రమే డబ్బులు డ్రా చేసేందుకు అవకాశం ఉంది.

ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్స్ ఉచితంగా అందిస్తుంది. ఆ తర్వాత మరో 10 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.40+GST, 25 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.75+GST చెల్లించాలి. 10 చెక్స్‌తో ఎమర్జెన్సీ చెక్ బుక్ కావాలంటే రూ.50+GST చెల్లించాలి. సీనియర్ సిటజన్లకు చెక్ బుక్‌పై కొత్త సర్వీస్ ఛార్జీ వర్తించదు.

ఇక ఎస్‌బీఐ, నాన్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లల్లో ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు జరిపే నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించరు.

Venkata Chari

Venkata Chari

Next Story