నా సమాచారం ఎవ్వరికీ ఇవ్వొద్దు: శశికళ

నా సమాచారం ఎవ్వరికీ ఇవ్వొద్దు: శశికళ
x
Highlights

అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన తరువాత బెంగళూరులో జైలు శిక్ష అనుభవిస్తున్న బహిష్కృత ఎఐఎడిఎంకె నాయకురాలు వికె శశికళ.. పరప్పన అగహర..

అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన తరువాత బెంగళూరులో జైలు శిక్ష అనుభవిస్తున్న బహిష్కృత ఎఐఎడిఎంకె నాయకురాలు వికె శశికళ.. పరప్పన అగహర సెంట్రల్ జైలు చీఫ్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు, తన విడుదలకు సంబంధించి ఏదైనా సమాచారం తనకు మాత్రమే ఇవ్వాలని అభ్యర్థించారు.. దీనిపై మూడవ వ్యక్తికి సమాచారం ఇవ్వొద్దని ఆమె లేఖలో పేర్కొన్నారు. తన వివరాలను ఎవరుపడితే వారు సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటుండడంతో ఆమె ఆగ్రహం చెందినట్టు తెలుస్తోంది. దీంతో జైలులో తన వ్యక్తిగత వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని కోరారు.

సమాచార హక్కుచట్టం ద్వారా తన విడుదల వ్యవహారం గురించి తెలుసుకుని మున్ముందు అడ్డంకులు సృష్టిస్తారనే అనుమానంతో ఈ లేఖ రాశారామె. ఇందుకు ఉదాహరంగా ఒక ఉదంతాన్ని కూడా చేర్చారు.. తీహార్ లో ఖైదీ అయిన వేద్ ప్రకాష్ ఆర్వ్యస్ గురించి ఆర్టీఐ చట్టం కింద ఒక దరఖాస్తు కోరినప్పుడు.. జైలు, సమాచార సమాచార చట్టంలోని సెక్షన్ 8 (1) (జె) కింద సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని నిషేధించడంతో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వివరాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇలా తన వివరాలు కూడా ఎవరికీ ఇవ్వొద్దని ఆమె కోరారు. కాగా మునుపటి ఆర్టీఐ సమాధానం ప్రకారం, శశికళ జరిమానా చెల్లిస్తే, ఆమె విడుదల తేదీ 2021 జనవరి 27 గా ఉండనుంది.. జరిమానా చెల్లించకపోయినట్లయితే అది ఫిబ్రవరి 2022 కు వాయిదా పడుతుంది. జరిమానాగా రూ.10 కోట్లు ముందుగా చెల్లించాల్సి ఉంది. అందుకే ఆమె ప్రతినిధి, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ బెంగళూరులో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories