జైలు నుంచి శశికళ విడుదల

జైలు నుంచి శశికళ విడుదల
x

జైలు నుంచి శశికళ విడుదల

Highlights

*అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష *బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో శశికళకు చికిత్స *ఈనెల 20న శశికళకు కరోనా నిర్ధారణ *శశికళ విడుదల ప్రక్రియ ఆస్పత్రిలో పూర్తి

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళ విడుదలయ్యారు. అయితే ప్రస్తుతం ఆమె కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న సమయంలోనే ఆమె విడుదలయ్యారు. దీంతో తమిళనాట ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని అందిరిలోనూ ఆసక్తి నెలకొంది.

తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన ఆమె ఈనెల 20న కరోనా బారిన పడ్డారు. దీంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో విడుదల ప్రక్రియను జైలు అధికారులు హాస్పిటల్లోనే పూర్తి చేశారు. ప్రస్తుతానికి ఆమెకు కరోనా లక్షణాలేవి లేవని వైద్యులు తెలిపిన.. ఆస్పత్రి నుంచి ఆమె ఎప్పుడు డిశ్చార్జి అవుతారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు శశికళ జైలు నుంచి విడుదలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక శశికళ జైలు నుంచి విడుదలైన వేళ నూతనంగా నిర్మించిన 'అమ్మ మెమోరియల్‌'ను సీఎం పళనిస్వామి ప్రారంభించారు. అయితే ఈ మెమోరియల్‌ దగ్గర పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గీయులు బలప్రదర్శన నిర్వహించారు.

మరోవైపు శశికళకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె వర్గీయులు ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరు నుంచి చైన్నై చేరుకునే సమయంలో కనీసం వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే దినకరన్‌, ఆయన అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే శశికళ జైలు నుంచి బయటకు వచ్చాక అన్నాడీఎంకేలో తిరిగి చేర్చుకోబోమని తమిళనాడు సీఎం పళనిస్వామి ఇటీవల వ్యాఖ్యనించారు.

మొత్తానికి శశికళ విడుదల కావడం.. తమిళనాడు ఎన్నికలు దగ్గర్లోనే ఉండండంతో ఆరాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి. అయితే ఎన్నికల వేళ ఆమె మౌనంగా ఉంటారా..? లేదంటే కొత్త పార్టీని తెర మీదకు తెస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories