అమ్మకు వందనం.. పూరీ గోల్డెన్ బీచ్ లో ఆకట్టుకున్న సైకత శిల్పం

Sand Art By Manas Kumar Sahoo For Mothers Day
x

అమ్మకు వందనం.. పూరీ గోల్డెన్ బీచ్ లో ఆకట్టుకున్న సైకత శిల్పం

Highlights

Mother's Day: అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి మానస్ కుమార్ సాహూ పూరీలోని గోల్డెన్ బీచ్‌లో ఇసుక శిల్పాన్ని చెక్కారు.

Mother's Day: అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి మానస్ కుమార్ సాహూ పూరీలోని గోల్డెన్ బీచ్‌లో ఇసుక శిల్పాన్ని చెక్కారు. తల్లీ బిడ్డల మధ్య స్వచ్ఛమైన ప్రేమ బంధాన్ని సూచించేలా చెక్కిన ఆ సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. అమ్మ అనేది భగవంతుని అత్యంత అందమైన సృష్టి. ఆమె తన బిడ్డను బేషరతుగా ప్రేమిస్తుంది. ఆమె మదర్స్ డే నాడు మాత్రమే కాకుండా ప్రతిరోజూ ప్రేమించటానికి అర్హురాలు. సాహూ తన కళ ద్వారా తెలియచెప్పేందుకు ప్రయత్నించడం నిజంగా అద్భుతం. ఇసుక కళను చెక్కడానికి సాహూకు దాదాపు ఏడు గంటల సమయం పట్టింది. 12 అడుగుల వెడల్పు ఉన్న ఈ కళను తయారు చేయడానికి మొత్తం 12 టన్నుల ఇసుకను ఉపయోగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories