Maoists: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. కాంట్రాక్టర్ గొంతుకోసి హత్య చేసిన మావోయిస్టులు

Maoists: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ రోడ్డు కాంట్రాక్టర్‌ను గొంతు కోసి దారుణ హత్య చేశారు.

Arun Chilukuri
Published on: 8 Dec 2025 11:55 AM IST
Maoists: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. కాంట్రాక్టర్ గొంతుకోసి హత్య చేసిన మావోయిస్టులు
X

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. కాంట్రాక్టర్ గొంతుకోసి హత్య చేసిన మావోయిస్టులు

Maoists: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ రోడ్డు కాంట్రాక్టర్‌ను గొంతు కోసి దారుణ హత్య చేశారు. కొన్నిరోజుల క్రితం అకౌంటెంట్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కాంట్రాక్టర్ అతడిని కాపాడేందుకు వెళ్లగా.. మావోయిస్టులు అతడిని చంపారు. ఈ ఘటన పమేడ్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగింది. హత్యకు గురైన కాంట్రాక్టర్ ఉత్తరప్రదేశ్ నివాసి ఇంతియాజ్ అలీగా గుర్తించారు.

మొదట మావోయిస్టులు JCB క్లర్క్‌ను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ వార్త అందగానే కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీ ఘటనాస్థలానికి చేరుకున్నాడు. క్లర్క్‌ను కాపాడటానికి ప్రయత్నిస్తుండగా.. కాంట్రాక్టర్ పట్టుబడ్డాడు. మావోయిస్టులు అతడి గొంతు కోసి చంపారు. అనంతరం మావోయిస్టులు కిడ్నాప్‌కు గురైన JCB క్లర్క్‌ను విడిచిపెట్టారు. దీంతో ఈ ప్రాంతంలో ఆపరేషన్ జరుగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story