Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident in Uttarakhand
x

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Highlights

Uttarakhand: గాయపడినవారికి రూ.50 వేలు ఆర్ధిక సహాయం

Uttarakhand: ఉత్తరాఖండ్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చంపావత్‌ జిల్లాలోని సుఖిధాంగ్‌ రీతా సాహిబ్‌ రోడ్డు సమీపంలో ఓ వాహనం లోయలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా ఇద్దరు గాయాలపాలయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్ర విపత్తు రెస్పాన్స్ ఫోర్స్ సహాయక చర్యలు చేపట్టింది. ఓ వివాహ శుభకార్యంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. దుర్ఘటనపై స్పందిస్తే ప్రధాని మోడి తన ప్రగాఢ సానుభూతిని ట్వీట్‌ చేసారు. మృతుల కుటుంబసభ్యులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు.

ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో జరిగిన ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నేను నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. స్థానిక యంత్రాంగం సహాయక మరియు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది." అని ట్వీట్ చేసిన ప్రధాని మోడి ప్రధానమంత్రి సహాయ నిధి నుండి ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు ఒక్కొక్కరికి 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం.

Show Full Article
Print Article
Next Story
More Stories