Ratha Saptami 2026: ఒకే రోజు ఏడు వాహనాలపై గోవిందరాజస్వామి దర్శనం.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Ratha Saptami 2026: ఒకే రోజు ఏడు వాహనాలపై గోవిందరాజస్వామి దర్శనం.. పూర్తి షెడ్యూల్ ఇదే!
x
Highlights

జనవరి 25న తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఒకే రోజు ఏడు వాహనాలపై స్వామివారు ఇచ్చే దర్శనాన్ని 'అర్థ బ్రహ్మోత్సవం'గా పిలుస్తారు. ఆ రోజు వాహన సేవల పూర్తి సమయాలు మరియు తిరుమల రద్దీ వివరాలు ఇక్కడ చూడండి.

తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో సర్వదర్శనానికి సమయం పెరుగుతోంది. మరోవైపు, తిరుపతిలోని చారిత్రాత్మక శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతోంది. జనవరి 25న జరగనున్న ఈ వేడుకను భక్తులు ‘అర్థ బ్రహ్మోత్సవం’ లేదా 'ఒకరోజు బ్రహ్మోత్సవం'గా పిలుచుకుంటారు.

తిరుమల లేటెస్ట్ అప్‌డేట్స్ (జనవరి 12 గణాంకాలు):

శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం నాటి వివరాలు ఇలా ఉన్నాయి:

దర్శించుకున్న భక్తులు: 76,447 మంది.

తలనీలాలు సమర్పించిన వారు: 21,708 మంది.

హుండీ ఆదాయం: రూ. 3.42 కోట్లు.

దర్శన సమయం: టోకెన్ లేని భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతోంది.

జనవరి 25: రథసప్తమి వాహన సేవల షెడ్యూల్

రథసప్తమి రోజున శ్రీ గోవిందరాజస్వామి వారు దేవేరులతో కలిసి ఏడు వేర్వేరు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆ వేడుకల వివరాలు:

అర్థ బ్రహ్మోత్సవం అని ఎందుకు అంటారు?

సాధారణంగా బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. కానీ రథసప్తమి నాడు సూర్యోదయం నుండి రాత్రి వరకు బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే ముఖ్యమైన వాహన సేవలన్నీ ఒకే రోజు నిర్వహిస్తారు. అందుకే దీనిని ‘అర్థ బ్రహ్మోత్సవం’ అని పిలుస్తారు. ఈ వేడుకను చూడటం భక్తులు మహా భాగ్యంగా భావిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories