Rajnath Singh: సముద్రంలో ఎక్కడ దాక్కున్నా.. వారిని వేటాడతాం

Rajnath Singh: భారత్‌కు వస్తోన్న వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం తీవ్రంగా పరిగణించినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

Shekhar G
Published on: 26 Dec 2023 8:21 PM IST
Rajnath Singh Will Find Attackers Of Merchant Navy Ships Even From Depths Of Seas And Take Strict Action
X

Rajnath Singh: సముద్రంలో ఎక్కడ దాక్కున్నా.. వారిని వేటాడతాం 

Rajnath Singh: భారత్‌కు వస్తోన్న వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం తీవ్రంగా పరిగణించినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. నౌకలపై వరుస దాడుల నేపథ్యంలో సముద్ర జలాల్లో గస్తీని ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. ఈ దాడులకు పాల్పడిన వారు సముద్రంలో ఎక్కడ దాక్కున్నా.. వేటాడి, పట్టుకుంటామని స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌ ను ముంబయి వేదికగా నౌకాదళంలో ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి ఈమేరకు మాట్లాడారు.

Shekhar G

Shekhar G

Next Story