రాజస్థాన్‌ జైసల్మేర్‌లో ఘోర బస్సు ప్రమాదం.. బస్సులో మంటలు చెలరేగి 20 మంది మృతి

Rajasthan Bus Fire Tragedy: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది.

Arun Chilukuri
Published on: 15 Oct 2025 11:29 AM IST
రాజస్థాన్‌ జైసల్మేర్‌లో ఘోర బస్సు ప్రమాదం.. బస్సులో మంటలు చెలరేగి 20 మంది మృతి
X

రాజస్థాన్‌ జైసల్మేర్‌లో ఘోర బస్సు ప్రమాదం.. బస్సులో మంటలు చెలరేగి 20 మంది మృతి

Rajasthan Bus Fire Tragedy: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ప్రయాణిస్తున్న ఏసీ స్లీపర్‌ బస్సులో మంటలు వ్యాపించడంతో 20 మంది మరణించినట్టు పోలీసులు తెలిపారు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. షార్ట్‌ సర్క్యూటే ఇందుకు కారణమని భావిస్తున్నారు. జైసల్మేర్‌-జోధ్‌పూర్‌ నేషనల్ హైవే థయ్యాత్‌ గ్రామం వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

ఆకస్మికంగా మంటలు చెలరేగి బస్సు అంతటా వ్యాపించడంతో ప్రయాణికులకు తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. కొందరయితే నడుస్తున్న బస్సు నుంచి కిందకు దూకి ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఇద్దరు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story