ప్రయాణికులపై రైల్వేశాఖ చార్జీల కొరడా

ప్రయాణికులపై రైల్వేశాఖ చార్జీల కొరడా
x
Highlights

లాక్‌డౌన్‌ తో జీవనోపాధి కోల్పోయిన సామాన్యులపై రైల్వేశాఖ మరింత భారం మోపనుంది. ఇప్పటికే టికెట్‌, ప్లాట్ ఫాం టికెట్ చార్జీలను పెంచేసింది. తాజాగా...

లాక్‌డౌన్‌ తో జీవనోపాధి కోల్పోయిన సామాన్యులపై రైల్వేశాఖ మరింత భారం మోపనుంది. ఇప్పటికే టికెట్‌, ప్లాట్ ఫాం టికెట్ చార్జీలను పెంచేసింది. తాజాగా ప్రయాణికులపై యూజర్‌ చార్జీలను మోపడానికి రంగం సిద్ధం చేసింది రైల్వేశాఖ. ఈ మేరకు కేంద్ర సర్కారు వేగంగా అడుగులు వేస్తున్నది. మరోవైపు ప్రైవేటీకరణలో భాగంగా పలు రూట్లను పెట్టుబడిదారులకు దారాదత్తం చేసింది కేంద్రం. ఆ రూట్లల్లో చార్జీలను నిర్ణయించే అధికారం పెట్టుబడిదారులకు అప్పగించింది. దీంతో రైల్వే చార్జీలు సామాన్యులకు మోయలేని భారం కానున్నాయి.

రైల్వేశాఖ ప్రతిపాదనల ప్రకారం యూజర్‌ చార్జీలు సుమారు 50 రూపాయాలు ఉండొచ్చని సమాచారం. దీనిపై ట్రాఫిక్‌ డైరెక్టరేట్‌ తుది కసరత్తులు చేస్తున్నది. ముందుగా అభివృద్ధి చేసిన 50 స్టేషన్లలో యూజర్ చార్జీలను అమలు చేయనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు. రైల్వే స్టేషన్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలంటే వసూలు చేయకతప్పదని ఆయన అన్నారు.

మరోవైపు ప్రైవేట్ రూట్లలో నడిచే రైళ్లలో టికెట్‌ ధరలను నిర్ణయించే అధికారం కూడా ప్రైవేట్ కు అప్పజెప్పేందుకు మోడీ సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. టికెట్ ధరల నిర్ణయాన్ని ప్రైవేట్ కే అప్పగిస్తే.. మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నది సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories