Rahul Gandhi: దేశంలో విధ్వేషాలు తొలగించడమే జోడో యాత్ర లక్ష్యం

Rahul Gandhi: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు దేశంలో విధ్వేషాలు సష్టిస్తున్నారు

Jyothi
Published on: 24 Jan 2023 2:54 PM IST
Rahul Gandhi Bharat Jodo Yatra In Jammu and Kashmir
X

Rahul Gandhi: దేశంలో విధ్వేషాలు తొలగించడమే జోడో యాత్ర లక్ష్యం

Rahul Gandhi: కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ దాకా సాగిన భారత్‌ జోడో యాత్ర లక్ష్యాన్ని వివరించారు రాహుల్‌ గాంధీ. దేశంలో వ్యక్తుల మధ్య విధ్వేషాలు తొలగించి.. దేశాన్ని ఒక్కతాటిపైకి తేవడమే భారత్‌ జోడో యాత్ర లక్ష్యమన్నారు రాహుల్‌ గాంధీ. జమ్మూ కాశ్మీర్‌తోపాటు దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు సృష్టించిన విధ్వేషాలను తొలగించడం యాత్ర లక్ష్యమన్నారు. అదే విధంగా ప్రస్తుతం దేశ సంపద మొత్తం కొంత మంది చేతుల్లో బందీ అయ్యిందన్నారు. దీని వలన ధరలు పెరుగుతున్నాయని.. దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఏర్ప డిందన్నారు రాహుల్‌ గాంధీ. జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

Jyothi

Jyothi

Next Story