సాయింత్రం 6 గంటలకి జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ!

సాయింత్రం 6 గంటలకి జాతినుద్దేశించి  ప్రసంగించనున్న మోడీ!
x
Highlights

PM Modi దేశ ప్రధాని మోడీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ రోజు సాయింత్రం ఆరు గంటలకి ఓ సందేశం ఇవ్వబోతున్నట్టుగా వెల్లడించారు. దేశ ప్రజలతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి అందరూ వినాలి అంటూ మోడీ ట్వీట్ చేశారు.

PM Modi దేశ ప్రధాని మోడీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ రోజు సాయింత్రం ఆరు గంటలకి ఓ సందేశం ఇవ్వబోతున్నట్టుగా వెల్లడించారు. దేశ ప్రజలతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి అందరూ వినాలి అంటూ మోడీ ట్వీట్ చేశారు. అయితే మోడీ ఎం చెప్పనున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దసరా, దీపావళి పండగలు వస్తున్న క్రమంలో కరోనా వైరస్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా కీలక ఆదేశాలు ఇవ్వనున్నారా అనే చర్చ జరుగుతుంది. కరోనా వైరస్ సమయంలో లాక్ డౌన్ పొడిగింపుల గురించి, కరోనా వ్యాప్తి పెరగకుండా తీసుకోవాల్సిన జగ్రత్తల గురుంచి మోడీ సందేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే..

ఇక అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ అంతేస్థాయిలో కోరోనా నుంచి కోలుకున్న వారు ఉండడం సంతోషించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 46,790 కేసులు నమోదు అయ్యాయి.. 587 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 69,720 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా 75,97,063 కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులు 7,48,538 ఉండగా, 67,33,328 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 88.63 శాతంగా ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories