ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
x
Highlights

నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై వివరాలు తెలుసుకోనున్నారు ప్రధాని.

నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై వివరాలు తెలుసుకోనున్నారు ప్రధాని. వ్యాక్సిన్ ప్రయోగాలన్నీ చివరి దశకు చేరుకోవటంతో, వాటి స్టోరేజ్ సామర్థ్యం, పంపిణీ వ్యూహంపై చర్చించనున్నారు. అయితే రెండు విడతలుగా ప్రధాని సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశమై ఆ తర్వాత కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అటు ఇండియాలో సోమవారం నాటికీ ఉన్న సమాచారం మేరకు కొత్తగా 44,059 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో కరోనా కేసుల సంఖ్య 91,39,865కి చేరింది. ఇక కొత్తగా 511 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,33,738కి చేరింది. ఇండియాలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories