Ahmedabad: మొతేరా స్టేడియంను ప్రారంభించిన రాష్ట్రపతి

President Inaugurates Motera Stadium in Ahmedabad
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

Ahmedabad: సర్దార్‌ పటేల్‌ (మొతేరా)స్టేడియంను రాష్ట్రపతి‌ బుధవారం వర్చువల్‌ విధానం ద్వారా ప్రారరంభించారు.

Ahmedabad: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించిన ప్ర‌పంచంలోనే అతిపెద్ద సర్దార్‌ పటేల్‌ (మొతేరా) స్టేడియంను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం వర్చువల్‌విధానం ద్వారా ప్రారరంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, కిరణ్ రిజిజు తదితరులు పాల్గొన్నారు. లక్షా పది వేల సీటింగ్‌ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా మొతేరా రూపుదిద్దుకుంది. ఈ మైదానంలో తొలి మ్యాచ్‌కు సర్వం సిద్ధం చేశారు. భారత్‌-ఇంగ్లాండ్‌ మూడో టెస్టు ఇక్కడ బుధవారమే ఆరంభం కానుంది.అసలే భారీ స్టేడియం.. పైగా డేనైట్‌లో, గులాబి బంతితో మ్యాచ్‌ జరగబోతుండటం క్రికెట్‌ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

నమస్తే ట్రంప్‌ ప్రోగ్రాం జరిగిన ప్రాంతం..

2017 జనవరిలో నిర్మాణం ప్రారంభమైన అనంతరం సరిగ్గా మూడేళ్ల తర్వాత స్టేడియం సిద్ధమైంది. గతేడాది 'నమస్తే ట్రంప్‌' ప్రోగ్రాం ఇక్కడే జరిగింది. ఇటీవల ముస్తాక్‌ అలీ ట్రోఫీ నాకౌట్‌ మ్యాచ్‌లతో తొలిసారి క్రికెట్‌ పోటీలకు గ్రౌండ్‌ ఆతిథ్యమిచ్చింది. ప్రస్తుతం తొలిసారి టెస్టు మ్యాచ్‌ కోసం సిద్ధమైంది. పైగా ఈ టెస్టు మ్యాచ్‌ పింక్‌ బాల్ తో జరిగే డేఅండ్‌ నైట్‌ టెస్టు కావడంతో మైదానం మరింత కాంతివంతంగా మెరవబోతోంది.

సబర్మతి నది ఒడ్డున స్టేడియం....

  • సబర్మతి నది ఒడ్డున స్టేడియం కోసం 100 ఎకరాలను 1982లో గుజరాత్ ప్రభుత్వం కేటాయించింది.ఆస్ట్రేలియాకు చెందిన పాపులస్‌ సంస్థ 49,000 సామర్థ్యమున్న పాత స్టేడియాన్ని కూలగొట్టి సుమారు రూ.678 కోట్లతో 1 లక్షా 10వేల సీటింగ్ తో కేవలం 9 నెలల్లోనే పునర్నిర్మించింది.
  • ప్రస్తుతం మైదానంలో 11 పిచ్‌లు ఉన్నాయి. ఎరుపు, నలుపు మట్టితో వికెట్లను సిద్ధం చేశారు. మైదానంలోని ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన బెర్ముడా గడ్డిని వాడారు. పిల్లర్లు లేకుండా స్టేడియాన్ని నిర్మించడం మరో అద్భుతం. ప్రేక్షకులు స్టేడియంలోని ఏ మూల కూర్చున్న ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ను తిలకించొచ్చు.
  • 55 గదులు, ఇండోర్‌.. ఔట్‌డోర్‌ క్రీడలు, రెస్టారెంట్లు, ఒలింపిక్‌ ప్రమాణాలతో స్విమ్మింగ్‌పూల్, జిమ్నాజియం, పార్టీ ఏరియా, 3డి థియేటర్‌లతో క్లబ్‌హౌస్‌ను ఈ స్టేడియంలో నిర్మించారు. క్రికెట్‌ అకాడమీ, ఇండోర్‌ ప్రాక్టీస్‌ పిచ్‌లూ స్టేడియంలో భాగమే.
  • ఈ స్టేడియంలో అదనంగా రెండు క్రికెట్‌ మైదానాల్లో 9 ప్రాక్టీస్‌ పిచ్‌ల్ని రూపొందించారు. ఫుట్‌బాల్, హాకీ, బాస్కెట్‌బాల్, కబడ్డీ, బాక్సింగ్, టెన్నిస్ లాంటి గేమ్స్ కి కావలసిన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు.
  • 8 సెంటీ మీటర్ల వర్షం కురిసినా..వెంటనే మ్యాచ్ ప్రారంభించేలా అధునాతన డ్రేనేజీ సిస్టంను రూపొందించారు. ఈ స్టేడియంలో 3 వేల కార్లు, 10 వేల టూ వీలర్ వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉంది.
  • దేశంలో ఎల్‌ఈడీ కాంతులు వెదజల్లనున్న మొట్టమొదటి స్టేడియం ఇదే. ఫ్లడ్‌లైట్లకు బదులు స్టేడియం పైకప్పునకే ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు. అయితే స్టేడియంలో ఆటగాళ్ల నీడ కూడా పడే అవకాశం లేకపోవడం మరో విశేషం.
Show Full Article
Print Article
Next Story
More Stories