కశ్మీర్ లో ఇద్దరిని కాల్చి చంపిన లష్కర్ ఉగ్రవాదులు

Policeman, Civilian Killed in Terror Attacks in Jammu and Kashmir
x

కశ్మీర్ లో ఇద్దరిని కాల్చి చంపిన లష్కర్ ఉగ్రవాదులు

Highlights

Jammu and Kashmir: జమ్ము కశ్మీర్ లో లష్కర్ ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు.

Jammu and Kashmir: జమ్ము కశ్మీర్ లో లష్కర్ ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. గంట వ్యవధిలోనే వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు సివిలియన్లను కాల్చి చంపడం కలకలం రేపుతోంది. మొదట శ్రీనగర్ అనంత్ నాగ్ ఏరియా బిజ్ బెహారాలో ఓ ఏఎస్ ఐ పై కాల్పులు జరిపారు. ఇది జరిగిన గంట వ్యవధిలోనే శ్రీనగర్ ఈద్గా సమీపంలో ఓ సామాన్య పౌరుడిపై కాల్పలు జరిపారు. గంటల వ్యవధిలోనే ఇద్దరిని ఉగ్రవాదులు కాల్చి చంపడం పట్ల ప్రజలలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పీడీపీ అధినేత్రి మహబూబా ముక్తి రెచ్చగొట్టే ప్రసంగం చేసిన గంటల వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. పాకిస్థాన్ చర్యలను సమర్ధి్స్తూ ఆమె ప్రసంగించడం ఇది రెండో సారి.

Show Full Article
Print Article
Next Story
More Stories