తన అడ్డగింతపై స్పందించిన ప్రధాని మోడీ.. నేను ఏయిర్‌పోర్టుకు ప్రాణాలతో చేరుకోగలిగా..

PM Narendra Modi Tweet on Punjab Incident
x

తన అడ్డగింతపై స్పందించిన ప్రధాని మోడీ.. నేను ఏయిర్‌పోర్టుకు ప్రాణాలతో చేరుకోగలిగా..

Highlights

Narendra Modi: పంజాబ్‌లో తనను అడ్డుకోవడంపై ప్రధాని మోడీ స్పందించారు.

Narendra Modi: పంజాబ్‌లో తనను అడ్డుకోవడంపై ప్రధాని మోడీ స్పందించారు. తాను తిరిగి ఎయిర్‌పోర్టుకు ప్రాణాలతో చేరుకోగలిగానన్నారు. ఇదే సమయంలో పంజాబ్ సీఎం చరణ్‌జీత్‌కు కృతజ్ఞతలు చెప్పాలంటూ భటిండా అధికారులకు చురకలంటించారు. అంతకంటే ముందు పంజాబ్‌ పర్యటనలో ప్రధాని మోడీకి నిరసనసెగ తగిలింది.

ఫిరోజ్‌పూర్ సభలో ప్రశంగించేందుకు వెళుతున్న ప్రధానిని ఆందోళన కారులు అడ్డుకున్నారు. 20 నిమిషాల పాటు మోడీ కాన్వాయ్‌ను కదలనివ్వలేదు. దీంతో ప్రధాని తిరిగి ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. అయితే, దీనిపై స్పందించిన పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ ప్రధాని భద్రతా చర్యల్లో ఎలాంటి లోపం లేదని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories