Narendra Modi: నేడు పంజాబ్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Narendra Modi to Visit  Punjabs Ferozepur Today | National News Today
x

నేడు పంజాబ్‌లో ప్రధాని మోడీ పర్యటన

Highlights

Narendra Modi: ఫిరోజ్​పుర్‌లో శాటిలైట్‌ సెంటర్‌ను ప్రారంభించనున్న మోడీ

Narendra Modi: ప్రధాని మోడీ ఇవాళ పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఫిరోజ్​పుర్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు చెందిన శాటిలైట్ సెంటర్‌ను మోడీ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో ర్యాలీలో పాల్గొననున్నారు. అలాగే రూ.42,750 కోట్లకుపైగా విలువైన అభివృద్ది పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌, ఢిల్లీ నుంచి కత్రా వరకు నాలుగు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం ద్వారా ప్రయాణ సమయం తగ్గిపోనుంది. అలాగే వైష్ణో దేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories