భారత్ చేరుకున్న ప్రధాని మోడీ.. ఐదు రోజుల విదేశీ పర్యటనలో...

PM Narendra Modi Reached India After Foreign Tour | National News
x

భారత్ చేరుకున్న ప్రధాని మోడీ.. ఐదు రోజుల విదేశీ పర్యటనలో...

Highlights

Narendra Modi - Foreign Tour: జీ-20, గ్లాస్కో కాప్-26 సదస్సుల్లో పాల్గొన్న ప్రధాని...

Narendra Modi - Foreign Tour: ఐదు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ భారత్ చేరుకున్నారు. ఇటలీ, యూకే పర్యటన ముగించుకొని ఢిల్లీకి వచ్చారు. పర్యటనలో భాగంగా.. జీ-20, కాప్-26 ప్రపంచ వాతావరణ సదస్సుల్లో పాల్గొన్నారు. ఇటలీ పర్యటనలో భాగంగా వాటికన్ సిటీని సైతం మోదీ సందర్శించారు. క్యాథలిక్ చర్చిల అధినేత పోప్ ప్రావిన్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా భారత్‌కు రావాలని పోప్‌ను మోదీ ఆహ్వానించారు.

గ్లాస్గోలో జరిగిన కాప్ 26 సదస్సులో మోడీ... "ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్" ని ప్రారంభించారు. స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, నేపాల్, మలావి, ఉక్రెయిన్, జపాన్ నాయకులతో మోడీ మాట్లాడారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ను కలిశారు. వాతావరణ మార్పులపై చర్చించారు. పారిస్ ఒప్పందం ప్రకారం వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారత దేశం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోందన్నారు మోడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories