Narendra Modi: ఈ నెల 29 నుంచి వచ్చే నవంబర్ 2 వరకు ప్రధాని విదేశీ పర్యటన

PM Narendra Modi Foreign Tour From October 29 2021 to November 2 2021 | National News
x

Narendra Modi: ఈ నెల 29 నుంచి వచ్చే నవంబర్ 2 వరకు ప్రధాని విదేశీ పర్యటన

Highlights

Narendra Modi: ఇటలీ, యూకే, స్కాట్లాండ్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ...

Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఇటలీ, రోమ్, యూకే, గ్లాస్గోకు ప్రధాని వెళ్తారు. మోదీ 16వ జీ-20 శిఖరాగ్ర సమావేశం కాప్-26 వరల్డ్ లీడర్స్ శిఖరాగ్ర సమవేశానికి హాజరవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటలీ ప్రధాని మారియో ఆహ్వానం మేరకు.. ఈనెల 30, 31 వరకు రోమ్‌లో జరిగే 16వ జీ-20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని పాల్గొంటారు. ఈ సమావేశంలో జీ-20 సభ్య దేశాలు, యూరోపియన్ యూనియన్, అంతర్జాతీయ సంస్థల ప్రభుత్వాధినేతలు కూడా పాల్గొంటారు.

ప్రధాని మోడీ హాజరవుతున్న జీ-20 సదస్సు ఎనిమిదవది. జీ-20 కూటమికి ప్రస్తుతం ఇటలీ నాయకత్వం వహిస్తోంది. ఈనెల 30, 31 వరకు రోమ్‌లో రెండు రోజుల పాటు జరిగే శిఖరాగ్ర సదస్సుకు ఆ దేశమే ఆతిథ్యం ఇస్తోంది. ఆఫ్గనిస్తాన్ పరిణామాలు, వాతావరణ మార్పులు మానవాళికి విసురుతున్న సవాళ్లు, కరోనా వైరస్ వంటి కీలక అంశాలపై జీ-20 సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇక 1999 నుంచి జీ-20 సదస్సుకు ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. కాప్-26 సదస్సు ఈనెల 31 నుంచి నవంబర్ 12 దాకా యూకేలోని గ్లాస్గోలో జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories