Modi: బ్లూ జాకెట్‌తో గ్రీన్‌ మెసేజ్‌ ఇచ్చిన ప్రధాని మోదీ

PM Modi Wears Jacket Made of Material Recycled From Plastic Bottles
x

Modi: బ్లూ జాకెట్‌తో గ్రీన్‌ మెసేజ్‌ ఇచ్చిన ప్రధాని మోదీ

Highlights

Modi: ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసి జాకెట్ తయారు

Modi: పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రాజ్యసభకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ నీలం రంగు జాకెట్‌లో కన్పించారు. సాధారణంగా మోదీ అలాంటి వస్త్రధారణలోనే కన్పిస్తారు కదా.. ఇందులో అంత విశేషమేముంది అంటారా? అయితే, ఈ జాకెట్‌ నిజంగానే ప్రత్యేకమైనది. ప్లాస్టిక్‌ బాటిళ్లను రీసైకిల్‌ చేసి ఈ జాకెట్‌ను తయారు చేశారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్‌ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్.. ప్రధానికి అరుదైన బహుమతిని అందజేసింది. పెట్ బాటిళ్లను రీసైకిల్‌ చేసి తయారు చేసిన నీలం రంగు జాకెట్‌ను మోడీకి కానుకగా ఇచ్చింది. ఆ జాకెట్‌నే ప్రధాని మోడీ ధరించి పార్లమెంట్‌కు వచ్చారు. బ్లూ జాకెట్‌తో హరిత సందేశమిచ్చారు. ఇక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ బ్లూ జాకెట్ ధరించి సమాధానమిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories